మహిళలు, పిల్లల భద్రత కోసం మహిళా శక్తి టీంలు

మహిళలు, పిల్లల భద్రత కోసం మహిళా శక్తి టీంలు

హైదరాబాద్: సికింద్రబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ప్రయాణికుల భద్రత కోసం  మహిళా శక్తి టీంలను ఏర్పాటు చేసినట్లు ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ డేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు. రైల్వేలో ప్రయాణించే మహిళలు, చిన్న పిల్లల భద్రత కోసం రెండు మహిళా శక్తి టీంలను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ టీంకు రుద్రమ్మ, కాజీపేట టీంకు నాగమ్మ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. ఒక్కో టీంలో మొత్తం 8 మంది విమెన్ ఆఫీసర్లు ఉంటారని ఆమె స్పష్టం చేశారు. మహిళా శక్తిని చాటిన రాణి రుద్రమ దేవి, మాజీ మంత్రి నాగమ్మ పేర్లను మహిళా శక్తి టీంలకు పెట్టడం గర్వంగా ఉందన్నారు. 

ప్రయాణికులు భద్రతే తమ లక్ష్యమన్న కమిషనర్.. మహిళా ప్రయాణికులకు ఏవైనా భద్రతా సమస్యలు తలెత్తితే వాట్సాప్ లో సమాచారం అందిస్తే... మహిళా శక్తి టీంలు వెంటనే స్పందిస్తాయని చెప్పారు. ఒకవేళ మహిళా టీంలు అందుబాటులో లేకుంటే మిగతా ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందిస్తారని చెప్పారు.